Monday, July 19, 2010

ఆలోచించండి...

రవీంద్రనాధ్ ఠాఘుర్ రచించిన కధలలో బిచ్చగాడు దివ్యపురుషుని కధ ఉంది.


ఒకరోజు ఆకాశంలో నుండి ఒక బంగారురథం వచ్చి బిచ్చగాడి ప్రక్కనే దిగింది,అందులో ఉన్న దివ్య పురుషుడుని చూసి తను చాలా అద్రుష్ట వంతుడనై పొవచ్చు అని బిచ్చగాడు అనుకున్నాడు.కాని ఆశ్చర్యంగా ఆ దివ్య పురుషుడేవచ్చి బిచ్చగాడిని బిక్షం అడుగసాగాడు,నిరాశతో తన దురద్రుష్ట్తానికి తిట్టుకుంటూ,తన జోలిలొ నుండి ఒక బియ్యపు గింజ తీసి ఆదివ్యపురుషునికి బిక్ష వెసాడు.ఒక గింజ పోయిందని చాలా బాధ పడ్డాడు.ఇంటికి వచ్చి పడుకొబోయె ముందు ఆ రోజు బిక్ష ఎంతవచ్చిందో చూసుకొనేందుకు తన జొలి విప్పిచూసాడు అందులో ఒక బంగారపు గింజ కనిపించింది ఆశ్చర్యపోయాడు. అది తను ఆ దివ్య పురుషునికి ఇచ్చిన దానికి ప్రతిఫలం అని వెంటనే గుర్తించాడు.తన దగ్గర వున్నవన్ని అతనికి వెయ్యనందుకు తనని తానే తిట్టుకున్నాడు.


ఇవ్వడం నేర్చుకో,ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ గా నీవు పొందుతావు.అలాకాకుండా దాచిపెట్టుకుంటే పరులపాలు అయిపోతుంది.తరచ్హుగా స్వార్ధ ప్రయోజనాలకు పాటు పడడానికే మన మనస్సు అలవాటు పడిపోయింది.వ్యక్తి తన స్వార్ధం కోసం కాకుండ అందరికోసం పాటుపడలో స్రుజనాత్మకతవుంది.మనం స్రుజనాత్మకంగా వుంటే,గొప్ప సంత్రుప్తి కలుగుతుంది.ఇంతకు మించి సత్రుప్తినిచ్చేది మరొకటిలేదు.
ఆలోచించండి,మూలతత్వ సారాన్ని జీర్ణించుకోండి.జీవితాన్ని మించిన గొప్ప కానుక లేదు.మానవాళికి చేసే మహోపకారం, లోకానికి సేవ చెయ్యడం.రండి ఆ సేవచేసి భగవంతుని క్రుపకు పాత్రులవుదాము.

No comments:

Post a Comment